Site icon NTV Telugu

Nara Lokesh: ఇది రాజధాని రైతులకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ గుడ్‌న్యూస్‌..

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Nara Lokesh: అమరావతి చట్టబద్ధ రాజధానిగా ప్రకటించడం కేవలం రైతులకు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అన్నారు మంత్రి నారా లోకేష్‌.. శాసనసభలో అమరావతి చట్టబద్ధ తీర్మానం పై చర్చలు జరుగుతున్న సమయంలో మీడియా చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ముందు శాసనసభకు రాకుండా, అమరావతి చట్టబద్ధతను తక్షణమే చేపట్టాలని కోరుకుంటున్నారు. ముఖ్యమైన ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగుళూరు వెళ్లిపోయిన విషయంపై కూడా లోకేష్ సెటైర్స్ వేశారు..

Read Also: New Rules for Coaching Centers: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు.. ఉల్లంఘిస్తే అంతే..!

“జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది, రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది మాట్లాడతాడు .. బహుశా జూమ్‌లోనే వస్తాడేమో” అని ఎద్దేవా చేశారు లోకేస్‌.. పరామర్శల పేరుతో వివాదాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు., అలాగే ముఖ్య సమావేశాలకు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతారని చెప్పారు.. మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సభ్యులు మాత్రమే రాజధానిపై చర్చించడానికి అర్హత కలిగారని లోకేష్ అభిప్రాయపడ్డారు. “సజ్జల వంటి వ్యక్తులు మాట్లాడితే అసెంబ్లీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి” అని చెప్పారు.

పార్లమెంటులో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నాయని, కాబట్టి స్థానిక వ్యతిరేకతను చూసి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని తెలిపారు మంత్రి నారా లోకేష్‌… గతంలో ముఖ్యమంత్రి పర్యటనల సమయంలో ఏర్పడిన అనవసర పరిస్థితులు.. పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం.. ఇప్పుడు లేవని, ప్రజలు హ్యాపీగా ఉన్నారని లోకేష్ వివరించారు. కాగా, ఈ చట్టబద్ధత అమరావతిని కేవలం రాజధానిగా మాత్రమే కాకుండా, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గతంలో ఎలాంటి ప్రోటోకాల్ ఎక్కువగా ఉపయోగించేవారని, ఇప్పుడు కేవలం అవసరమైన ప్రోటోకాల్ మాత్రమే అమలు చేయబడుతోందని చెప్పారు.

Exit mobile version