Vizag Chit Fund Fraud: చిట్టీ పేరుతో కుచ్చుటోపీ.. నాలుగు కోట్లతో పరార్
A Man Named Mani Kumar Dumped Vizag People In The Name Of Chit Fund: ఈరోజుల్లో జనాలు చాలా అప్డేట్ అయ్యారు. మోసాలకు పాల్పడే మోసగాళ్లను ముందే పసిగట్టేసి, వారి బారిన పడకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా కొందరు జనాలకు శఠగోపం పెట్టి.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. జనాలకు తెలియకుండా.. చాప కింద నీరులాగా డబ్బుల్ని సునాయాసంగా దోచేసుకుంటున్నారు. తాము మోసపోతున్నామన్న విషయం జనాలకు తెలియకుండా.. వెన్నె పూస్తున్నారు. ఇప్పుడు ఓ ఘరానా మోసగాడు కూడా విశాఖ ప్రజలకు అలాగూ వెన్నె రాసి.. ఏకంగా నాలుగు కోట్లతో పరారయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నంలోని వన్ టౌన్లో మణికుమార్ అనే వ్యక్తి 9 స్టార్ ఎంటర్ప్రైజెస్ షాపుని నిర్వహిస్తున్నాడు. ఇతడు చిట్టీలు వేయడంలో ఫేమస్ కావడంతో.. ఇతని వద్ద చిట్టీలు వేసేందుకు చాలామంది ముందుకొచ్చారు. నమ్మకస్తుడన్న కూడా పేరు కూడా రావడంతో, పెద్ద మొత్తంలోనే చిట్టీలు వేయడం జరిగింది. అయితే.. కొద్దిరోజులుగా అతడు షాప్ తెరవలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. ఏదో పని మీద బయటకు వెళ్లి ఉండొచ్చని, ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాడులే అని, కొన్ని రోజుల పాటు జనాలు మౌనంగానే ఉన్నారు. చివరికి తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించి.. బాధితులు లబోదిబోమంటున్నారు. అతని షాప్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మణికుమార్ సుమారు నాలుగు కోట్లతో పరారైనట్టు తేలింది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
Also Read
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
తాజావార్తలు
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!