New Beaches in Vizag: విశాఖలో జీఐఎస్.. నాలుగు కొత్త బీచ్ల ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Beaches in Vizag: ఆంప్రదేశ్కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. ఈ సమ్మిట్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. ఇప్పటికే 12,000కిపైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి.. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.. అయితే, అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త బీచ్ ల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..
Read Also: NBK 108: త్వరలో స్టార్ట్ అవ్వనున్న కొత్త షెడ్యూల్… జాయిన్ అవ్వనున్న కాజల్
Also Read
విశాఖ తీరంలో నాలుగు కొత్త బీచ్ లను ఏర్పాటు చేస్తున్నారు.. సాగర్ నగర్, జోడుగుళ్ల పాలెం, మంగమారిపేట, తొట్లకొండ బీచ్లను అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం.. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.. 25 కిలోమీటర్ల స్ట్రెచ్ లో కొత్త బీచ్ లు ఏర్పాటు చేస్తున్నారు.. అయితే, పనుల పురోగతిని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ను మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.. సీఎం వైఎస్ జగన్, కొంత మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు విడిది చేయనున్నారు.. ఇప్పటికే 12 వేల మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. సిటీలో బ్యూటీఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.. రోడ్ల మరమ్మత్తులు, ఎలక్ట్రీషియన్ వర్క్ పూర్తి అయ్యాయి.. విశాఖ రాష్ట్ర రాజధాని అని ముఖ్యమంత్రి ఢిల్లీ సమావేశంలో స్పష్టం చేశారని గుర్తుచేశారు. హోటల్స్ లో దాదాపు వెయ్యి రూమ్లు రిజర్వ్ అయ్యాయని తెలిపారు. అయితే, విశాఖలో ప్రస్తుతం చేస్తున్న పనులు.. కేవలం సదస్సుల కోసం చేస్తున్న తాత్కాలిక ఏర్పాట్లు కావు.. విశాఖను రాష్ట్ర రాజధానిగానే ప్రాజెక్ట్ చేస్తాం అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!