Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో భారీ ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 113 మంది ఉద్యోగుల పదవీ విరమణ చేశారు. ఇద్దరు డిప్యూటి ఈఓ స్థాయి ఉద్యోగులుతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు పదవీ విరమణ చేశారు. దీంతో 5 డిప్యూటీ ఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివాదంకొనసాగుతుండటంతో.. ప్రమోషన్లను టీటీడీ అధికారులు తాత్కాలికంగా నిలిపి వేశారు.
Read Also: Balochistan : బలూచిస్తాన్లో రోడ్డెక్కిన యువత.. పాక్ పై తీవ్ర ఆగ్రహం
ఇక, తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది అని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. ఇక, స్వామివారిని నిన్న 80, 404 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 35, 825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే, తిరుమల హుండీ ఆదాయం 3. 83 కోట్ల రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు కనీస సదుపాయాలను అందిస్తున్నారు.