టీకా విషయంలోనే కాదు.. ఫైన్లలోనూ రికార్డే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలాన్ని సూచించడానికి మన పూర్వీకుల దగ్గరి నుంచి నేటి జనరేషన్ వరకు కూడా క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మాట్లాడేవాళ్లు. అయితే ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆ పిలుపుకు బ్రేక్ పడినట్లే కన్పిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ఎప్పుడైతే ఆ దేశాన్ని వీడి ప్రపంచానికి పాకిందో అప్పటి నుంచి కరోనా పేరు మార్మోమోగిపోయింది. ఇది సృష్టించిన బీభత్సం తలుచుకుంటేనే వెన్నులో వణుకుపట్టడం ఖాయం. కోవిడ్-19 ఎఫెక్ట్ తో ఇప్పుడంతా కరోనాకు ముందు(Before Corona).. కరోనాకు తర్వాత(After Corona) అని మాట్లాడుకుంటున్నారు.
భారత్ లోనూ కరోనా ఎఫెక్ట్ భారీగానే పడింది. భారతదేశం తొలివేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ లో చతికిలపడింది. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి రావడంతో కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి నిలకడగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై అవగాహన కల్పించడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనాకు దూరంగా ఉంటున్నారు. అయితే కొంతమంది ఇప్పటికీ కూడా కరోనా విషయంలో డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తుండటం ఆందోళన రేపుతోంది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
ఇక ఏపీ విషయానికొస్తే కరోనా విషయంలో జగన్ సర్కార్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దీనివల్లే ప్రస్తుతం ఏపీలో కరోనా కట్టడిలోకి వచ్చింది. కరోనా టీకా పంపిణీలో ఏపీ ముందంజలో ఉంది. కరోనా ఫస్టు డోస్, సెకండ్ డోసుల పంపిణీని పరిగణలోకి తీసుకుంటే కేరళ తొలిస్థానంలో ఉండగా ఏపీలో దేశంలో ఐదవ స్థానంలో ఉంది. ఏపీలో 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 3.47కోట్ల మంది అర్హులు ఉండగా వీరిలో మూడుకోట్ల మంది తొలి డోస్ పూర్తి చేసుకున్నారు. 1.66కోట్ల మంది సెకండ్ డోస్ తీసుకున్నట్లు సమాచారం.
టీకా విషయంలో ఏపీలో ఎలాగైతే రికార్డులను సృష్టిస్తూ ముందుకెళుతుందో కరోనా ఫైన్ల విషయంలో అలాంటి రికార్డులనే నమోదు చేస్తోంది. 2021 అక్టోబర్ చివరి నాటికి కరోనా నిబంధనలు పాటించని 44లక్షల33వేల798 మంది ప్రభుత్వానికి ఫైన్లు కట్టారు. వీటి ద్వారా ఏకంగా 31కోట్ల 87లక్షల 79వేల 993 రూపాయాలు జరిమానాల రూపంలో ప్రభుత్వానికి సమకూరాయి. కరోనా నిబంధనలు ఎక్కువగా ఉల్లంఘించని వారిలో విశాఖ వాసులు ముందున్నారు. 11లక్షల42వేల మందిపై కరోనా కేసులు నమోదయ్యాయి.
అయితే కరోనా ఫైన్లు ఎక్కువగా కట్టిన జిల్లా మాత్రం చిత్తూరు. ఈ జిల్లా నుంచి ఏకంగా 6.02కోట్లు వసూలయ్యాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, గుంటూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కోటికి పైగానే జరిమానా దాటాయి. మొత్తానికి ఏపీ కరోనా టీకా విషయంలోనే కాకుండా ఫైన్ల విషయంలో ముందుండటం విశేషం. ఏదిఏమైనా ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించి ఈ మహమ్మరిని తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!