Site icon NTV Telugu

ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌తో బిజీగా మారిన ఆ పిల్ల‌ల రెస్టారెంట్‌…

ఆనంద్ మ‌హీంద్రా బిజినెస్ రంగంలో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉంటారు. మ‌ట్టిలోని మాణిక్యాల‌ను త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం చేస్తుంటారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటూ ఉంటారు. తాజ‌గా ఆనంద్ మ‌హీంద్రా పంజాబ్ లోని అమృత్‌స‌ర్‌లోని ఓ రెస్టారెంట్ గురించి ట్వీట్ చేశారు. మూడు నెల‌ల క్రితం అమృత్‌స‌ర్‌లోని సుల్తాన్ గేట్ వ‌ద్ద ఓ చిన్న రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. అయితే, దాని య‌జ‌మాని హ‌ఠాత్తుగా చ‌నిపోవ‌డంతో 17, 11 ఏళ్ల చిన్నారులు ఆ రెస్టారెంట్ బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్నారు. రెస్టారెంట్ కు సంబంధించిన విష‌యాలు తెలియ‌కున్నా, అనుభ‌వం లేకున్నా వారు రెస్టారెంట్‌ను న‌డ‌ప‌డం మొద‌లుపెట్టారు.

Read: కొత్త వేరియంట్ల పుట్టుక‌పై శాస్త్ర‌వేత్త‌ల కీల‌క ప‌రిశోధ‌న‌…

వీరి గురించి తెలుసుకున్న ఆనంద్ మ‌హీంద్రా ఆ హోట‌ల్ గురించి ట్వీట్ చేశారు. అమృత్‌స‌ర్ వెళ్లిన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లాల‌ని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ మ‌హీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ త‌రువాత ఆ రెస్టారెంట్‌కు వ‌స్తున్న వినియోగ‌దారుల సంఖ్య క్ర‌మంగా పెరిగింది. తాను అమృత్‌స‌ర్ వెళ్లిన స‌మ‌యంలో త‌ప్ప‌కుండా ఆ రెస్టారెంట్‌కు వెళ్తాన‌ని ఆనంద్ మ‌హీంద్రా పేర్కొన్నారు.

Exit mobile version