Telangana Best in India: దేశంలో తెలంగాణ అత్యుత్తమం. ‘హైసియా-ఈఎస్జీ సస్టెయినబిలిటీ మీట్’లో జయేష్ రంజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Best in India: ఈఎస్జీ.. అంటే.. ఎన్విరాన్మెంటల్(పర్యావరణ), సోషల్(సామాజిక) మరియు గవర్నెన్స్(పాలన)పై హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) శ్రద్ధ చూపటం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈఎస్జీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు హైసియాని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. మనమంతా ఈఎస్జీపై సరైన సమయంలోనే దృష్టిపెడుతున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో సౌర విద్యుదుత్పత్తి (పునరుత్పాదక ఇంధన వనరులు) 10 శాతంగానే ఉండగా రాష్ట్రంలో 16 శాతంగా నమోదైందని చెప్పారు.
తలసరి సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం చూస్తే కర్ణాటక తర్వాత ర్యాంక్ మనదేనని వెల్లడించారు. సోలార్ పవర్ జనరేషన్ను పెంచుకోవటం, రెన్యువబుల్ రిసోర్సులను సమర్థంగా వినియోగించుకోవటం గ్రీన్ ఎనర్జీ కమిట్మెంట్స్లో, కర్బన ఉద్గారాలను తగ్గించటంలో భాగమేనని వివరించారు. ఈ దిశగా విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై తెలంగాణ సంపూర్ణ అవగాహనతో, ప్రగతిశీలమైన విధానంతో ముందుకెళుతోందని అన్నారు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
read more: Special Story on Vikram S Kirloskar: మన దేశ ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకుడు
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ప్రవేశపెట్టి కేవలం రెండేళ్లే అయినప్పటికీ ఎంతో ప్రోత్సాహకర వాతావరణం నెలకొందని చెప్పారు. విధానపరమైన లోపాలేమైనా ఉంటే సరిచేసుకుంటున్నామని తెలిపారు. తద్వారా ప్రజలు సంప్రదాయ వాహనాల నుంచి విద్యుత్ వాహనాల వైపు తేలిగ్గా మొగ్గు చూపేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ మేరకు చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇ-దిశగా (ఎలక్ట్రిక్ వాహనాల దిశగా) రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తోందని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
హైసియాలో జరిగిన ఈ మీట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐటీ ఇండస్ట్రీలోని సీనియర్ బిజినెస్ లీడర్లు, సీఈఓలు/సీఓఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైసియా ప్రెసిడెంట్ మనీషా సబూ మాట్లాడుతూ సస్టెయినబిలిటీ ఇనీషియేటివ్స్ పరంగా హైదరాబాద్ చక్కని ప్రగతి కనబరుస్తోందని చెప్పారు. ఆసియా పసిఫిక్ సస్టెయినబిలిటీ ఇండెక్స్-2021లో భాగ్య నగరం 17వ ర్యాంక్ పొందిందని, తద్వారా బెంగళూరు, ఢిల్లీ, ముంబై సిటీల సరసన చేరిందని తెలిపారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..