Telangana Best in India: దేశంలో తెలంగాణ అత్యుత్తమం. ‘హైసియా-ఈఎస్జీ సస్టెయినబిలిటీ మీట్’లో జయేష్ రంజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Best in India: ఈఎస్జీ.. అంటే.. ఎన్విరాన్మెంటల్(పర్యావరణ), సోషల్(సామాజిక) మరియు గవర్నెన్స్(పాలన)పై హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) శ్రద్ధ చూపటం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈఎస్జీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు హైసియాని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. మనమంతా ఈఎస్జీపై సరైన సమయంలోనే దృష్టిపెడుతున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో సౌర విద్యుదుత్పత్తి (పునరుత్పాదక ఇంధన వనరులు) 10 శాతంగానే ఉండగా రాష్ట్రంలో 16 శాతంగా నమోదైందని చెప్పారు.
తలసరి సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం చూస్తే కర్ణాటక తర్వాత ర్యాంక్ మనదేనని వెల్లడించారు. సోలార్ పవర్ జనరేషన్ను పెంచుకోవటం, రెన్యువబుల్ రిసోర్సులను సమర్థంగా వినియోగించుకోవటం గ్రీన్ ఎనర్జీ కమిట్మెంట్స్లో, కర్బన ఉద్గారాలను తగ్గించటంలో భాగమేనని వివరించారు. ఈ దిశగా విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై తెలంగాణ సంపూర్ణ అవగాహనతో, ప్రగతిశీలమైన విధానంతో ముందుకెళుతోందని అన్నారు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
read more: Special Story on Vikram S Kirloskar: మన దేశ ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకుడు
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ప్రవేశపెట్టి కేవలం రెండేళ్లే అయినప్పటికీ ఎంతో ప్రోత్సాహకర వాతావరణం నెలకొందని చెప్పారు. విధానపరమైన లోపాలేమైనా ఉంటే సరిచేసుకుంటున్నామని తెలిపారు. తద్వారా ప్రజలు సంప్రదాయ వాహనాల నుంచి విద్యుత్ వాహనాల వైపు తేలిగ్గా మొగ్గు చూపేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ మేరకు చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇ-దిశగా (ఎలక్ట్రిక్ వాహనాల దిశగా) రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తోందని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
హైసియాలో జరిగిన ఈ మీట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐటీ ఇండస్ట్రీలోని సీనియర్ బిజినెస్ లీడర్లు, సీఈఓలు/సీఓఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైసియా ప్రెసిడెంట్ మనీషా సబూ మాట్లాడుతూ సస్టెయినబిలిటీ ఇనీషియేటివ్స్ పరంగా హైదరాబాద్ చక్కని ప్రగతి కనబరుస్తోందని చెప్పారు. ఆసియా పసిఫిక్ సస్టెయినబిలిటీ ఇండెక్స్-2021లో భాగ్య నగరం 17వ ర్యాంక్ పొందిందని, తద్వారా బెంగళూరు, ఢిల్లీ, ముంబై సిటీల సరసన చేరిందని తెలిపారు.
తాజావార్తలు
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!