Site icon NTV Telugu

విద్యుత్ బిల్లుల మోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు…

సీఎం జగన్ చేతకానితనంతో, అవినీతి ధన దాహంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఓ వైపు విద్యుత్ బిల్లుల మోతలు, మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కరెంట్ ఉత్పత్తి చేయటం చేతకాక సాయంత్రం 6 నుంచి 10 వరకు ఏసీలు ఆపు చేయమంటున్నారు. మరో నెల ఆగితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది రోజుకు ఒక పూటే భోజనం చేయండని అంటారేమో అని ప్రశ్నించారు. అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 6 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఆడిన మాట తప్పుతాననే విషయాన్ని మరోసారి ప్రజలకు చెప్పారు అని పేర్కొన్నారు.

Exit mobile version