NTV Telugu Site icon

నిర్లక్ష్యం వహించే సర్పంచులపై చర్యలు : మంత్రి పెద్దిరెడ్డి

జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గ్రామాలను పచ్చదనంగా మారుస్తున్నాం అని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రామాల్లో చెట్లను పెంచే బాధ్యతను సర్పంచులకు అప్పచెబుతున్నాం. సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరుజిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం. దీంతో రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేస్తాం. నేను రైతును..రైతు కష్టాలు నాకు తెలుసు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే 5 లక్షల లోపు పెండింగ్ లో నరేగా బిల్లులు చెల్లించాం. మిగిలిన పనులకు విజిలెన్స్ నివేదిక రాగానే చెల్లిస్తాం. చంద్రబాబు చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు.