Site icon NTV Telugu

Puranapul Bridge: హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించిన తొలి వంతెన ఇదే…

హైద‌రాబాద్ భిన్న‌త్వంలో ఏక‌త్వానికి ప్ర‌తీక‌. ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చి హైద‌రాబాద్‌లో సెటిల్ అవుతుంటారు. ఇక్క‌డ ఎన్నో చారిత్రాత్మ‌క క‌ట్ట‌డాలు ఉన్నాయి. ప్రేమ‌కు చిహ్నాలుగా క‌ట్టిన క‌ట్ట‌డాలు ఉన్నాయి. అలాంటి క‌ట్ట‌డాల్లో ఒక‌టి పురానాపూల్ బ్రిడ్జి. ఈ వంతెన ప్రేమ‌కు చిహ్నంగా నిర్మించారు. కులీకుతుబ్ షా, భాగ‌మ‌తి ప్రేమ‌కు గుర్తుగా ఈ మూసీ న‌దిపై వంతెన‌ను నిర్మించారు. గోల్కొండ కోట‌లో ఉండే కులీకుత‌బ్ షా, మూసీ న‌దికి ఇవ‌త‌ల ఉండే భాగ‌మ‌తి ప్రేమ‌లో ప‌డిన త‌రువాత మూసీని దాటేందుకు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని చెప్పి ఈ వంతెన‌ను నిర్మించారు. 1578లో ఈ వంతెన నిర్మాణం జ‌రిగింది.

Read: Mask: ఈ కార్టూన్‌ను చూస్తే… మాస్క్‌ను అస్సులు తీయ‌రు…

హైద‌రాబాద్‌లో నిర్మించిన తొలి వంతెన కూడా ఇదే. అయితే, ఈ వంతెన‌కు ప్యారానాపూల్ అని నామ‌క‌ర‌ణం చేశారు. కాల‌క్ర‌మేనా అది పురానాపూల్‌గా మారింది. మూసీపై నిర్మించిన ఈ వంతెన ఎన్నో ఆటుపోటుల‌ను ఎదుర్కొన్న‌ది. చ‌రిత్ర‌కు సాక్ష్యంగా నిలిచింది. అయితే, ఈ వంతెన‌పై ప్ర‌స్తుతం కాయ‌గూర‌ల మార్కెట్ వెలిసింది. చ‌రిత్ర‌కు సాక్ష్యంగా ఉన్న వంతెన‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకొని ప‌ర్యాట‌క ప‌రంగా అభివృద్ది చేయాల‌ని స్థానికులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Exit mobile version