Mp Santosh Kumar: గిర్ నేషనల్ పార్క్‌లో అమ్మ, అందమైన పిల్లలు

Santosha

Santosha

ఎంపీ సంతోష్ కుమార్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. మదర్స్ డే సందర్భంగా గిర్ నేషనల్ పార్క్ లో తను చిత్రీకరించిన సింహాల ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ మదర్స్ డే సందర్భంగా నేను ఇటీవల గిర్ నేషనల్ పార్క్‌లో చిత్రీకరించిన ఈ మనోహరమైన ఫోటోలను పంచుకోవడం సముచితమని భావిస్తున్నాను.అమ్మ,అందమైన పిల్లలు ఒకరితో ఒకరు పంచుకునే బంధం కళ్లకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది. ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ కుమార్ పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన సంతోష్ కుమార్ స్ఫూర్తితో సెలబ్రిటీలు, నేతలు, సినీతారలు వీఐపీలు విరివిగా మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే.

Drugs Rocket: మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు