మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నీతూ గంగాస్కు స్వర్ణం వరించింది. 48 కేజీల విభాగంలో బాక్సర్ నీతూ గంగాస్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది. టోర్నీ చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన ఆరో భారత మహిళగా నీతూ గంగాస్ నిలిచింది. నిరుడు స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టిన నీతు.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లోనూ తాజాగా తన సత్తా చాటింది. భారత్కు చెందిన మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఇప్పుడు ఆ జాబితాలో నీతూ సైతం చేరింది. 48 కేజీల కేటగిరీ ఫైనల్లో మంగోలియన్కు చెందిన లుత్సాయిఖాన్ అల్టాన్సెట్సెగ్ను 5-0తో ఏకగ్రీవంగా ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీ ఫైనల్స్లో భారత బాక్సింగ్ స్టార్ కజకిస్థాన్కు చెందిన అలువా బల్కిబెకోవాను ఓడించింది.
Also Read: Women’s World Boxing Championships: నీతూ గంగాస్ కు ‘గోల్డ్ మెడల్’
ఈ టోర్నీలో భారత్కు చెందిన మేరీకోమ్, లైష్రామ్ సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కెసి మరియు నిఖత్ జరీన్ స్వర్ణ పతకాలు సాధించారు. ప్రతి ఇతర క్రీడాకారిణి ఒకసారి గౌరవాన్ని గెలుచుకున్నప్పటికీ, మేరీ కోమ్ మాత్రమే ఆరుసార్లు పతకాన్ని అందుకున్నారు. మేరీకోమ్ 2002, 2005, 2006, 2008, 2010, 2018లో టైటిళ్లు గెలుచుకుంది. సరితా దేవి (2006), జెన్నీ ఆర్ఎల్ (2006), లేఖా కెసి (2006) నిఖత్ జరీన్ (2022) ప్రపంచ టైటిల్ గెలిచారు. ఈ టోర్నీలో నీతూ గంగాస్ సాధించిన స్వర్ణ పతకం భారత్కు 11వది.
CHAMPION 🏆🥇
Nitu is a World Champion 💪🤩
Book your tickets for the final 🔗 on 🔗:https://t.co/k8OoHXo2BA@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @IBA_Boxing @NituGhanghas333 pic.twitter.com/C19mVQybrT
— Boxing Federation (@BFI_official) March 25, 2023
