పోరాడుతున్న వరుణ్ సింగ్… ఆ లేఖ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో వరుణ్ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.
ఇదిలా వుంటే వరుణ్ సింగ్ గతంలో రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చదివిన హర్యానాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్కు సెప్టెంబర్లో వరుణ్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. తాము సాధారణం అని భావించే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు వరుణ్ సింగ్ పేర్కొన్నారు. తమిళనాడులో హెలికాఫ్టర్ దుర్ఘటన సమయంలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ లేఖ చదివిన వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
Also Read
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
మీ లక్ష్యం ఏంటో మీరు గుర్తించండి. దేని కోసం పనిచేసినా.. మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ మీలోని ఆశను, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వీడవద్దు. జీవించాలనే ఆశతో మృత్యువుతో వీరోచితంగా పోరాడుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మనసు నుంచి వచ్చిన మాటలివి. ఎంచుకున్న వృత్తిలో రాణించేవరకు ఆయన కూడా సాధారణ విద్యార్థే. అద్బుత విజయాలు ఆయనకు అయాచితంగా రాలేదు.
చదువులో చాలా సాధారణ విద్యార్ధి వరుణ్ సింగ్. 12వ తరగతిలో ఫస్ట్ డివిజన్ మాత్రమే పొందారాయన. చదువొక్కటే కాదు.. ఆటలు, ఇతర కార్యక్రమాల్లో కూడా అంత చురుకైన విద్యార్ధి కాదట. విమానాలు, విమానయానం గురించి తెలుసుకోవాలని మాత్రం ఆసక్తి. కానీ అవన్నీ సాధ్యమవుతాయనే భావన ఆయనలో వుండేదిట. ఎప్పుడైతే ఫ్లైట్ స్క్వాడ్రన్లో యంగ్ ఫ్లైట్ లెఫ్టినెంట్గా ఎంపికయ్యాడో.. అప్పటి నుంచి ఆయన ఆలోచన మారిపోయింది. మనస్సు పెట్టి. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే.. గొప్పగా పనిచేయగలనని వరుణ్ కి అర్థమైంది. ఇదే విషయాలు ఆయన తనలేఖలో పేర్కొన్నారు.
ఛాలెంజింగ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ కోర్సులో రెండు ట్రోఫీలను గెలుచుకున్న వరుణ్ కెరీర్లో వెనుతిరిగి చూడలేదు. తేజస్ ఫైటర్ స్క్వాడ్రన్లో పోస్టింగ్ పొందడంతో ఆయనలో విశ్వాసాన్ని బాగా పెంచిందట. ఇస్రో చరిత్రలో మేకింగ్ గగన్యాన్ ప్రొగ్రామ్ కోసం 12 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో కూడా చోటుదక్కించుకున్నారంటే వరుణ్ సింగ్ ఎంత ప్రతిభ కనబరిచారో అర్థం చేసుకోవచ్చు. టెంత్ క్లాస్, ఇంటర్, 12వ తరగతి మార్కులే ప్రాతిపదిక కాదు. మీ మార్కులు మీజీవితాన్ని శాసించలేవని వరుణ్ సింగ్ తన లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు కోట్లాదిమంది యువతను ఆలోచింపచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!