పోరాడుతున్న వరుణ్ సింగ్… ఆ లేఖ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో వరుణ్ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.
ఇదిలా వుంటే వరుణ్ సింగ్ గతంలో రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చదివిన హర్యానాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్కు సెప్టెంబర్లో వరుణ్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. తాము సాధారణం అని భావించే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు వరుణ్ సింగ్ పేర్కొన్నారు. తమిళనాడులో హెలికాఫ్టర్ దుర్ఘటన సమయంలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ లేఖ చదివిన వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
Also Read
మీ లక్ష్యం ఏంటో మీరు గుర్తించండి. దేని కోసం పనిచేసినా.. మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ మీలోని ఆశను, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వీడవద్దు. జీవించాలనే ఆశతో మృత్యువుతో వీరోచితంగా పోరాడుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మనసు నుంచి వచ్చిన మాటలివి. ఎంచుకున్న వృత్తిలో రాణించేవరకు ఆయన కూడా సాధారణ విద్యార్థే. అద్బుత విజయాలు ఆయనకు అయాచితంగా రాలేదు.
చదువులో చాలా సాధారణ విద్యార్ధి వరుణ్ సింగ్. 12వ తరగతిలో ఫస్ట్ డివిజన్ మాత్రమే పొందారాయన. చదువొక్కటే కాదు.. ఆటలు, ఇతర కార్యక్రమాల్లో కూడా అంత చురుకైన విద్యార్ధి కాదట. విమానాలు, విమానయానం గురించి తెలుసుకోవాలని మాత్రం ఆసక్తి. కానీ అవన్నీ సాధ్యమవుతాయనే భావన ఆయనలో వుండేదిట. ఎప్పుడైతే ఫ్లైట్ స్క్వాడ్రన్లో యంగ్ ఫ్లైట్ లెఫ్టినెంట్గా ఎంపికయ్యాడో.. అప్పటి నుంచి ఆయన ఆలోచన మారిపోయింది. మనస్సు పెట్టి. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే.. గొప్పగా పనిచేయగలనని వరుణ్ కి అర్థమైంది. ఇదే విషయాలు ఆయన తనలేఖలో పేర్కొన్నారు.
ఛాలెంజింగ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ కోర్సులో రెండు ట్రోఫీలను గెలుచుకున్న వరుణ్ కెరీర్లో వెనుతిరిగి చూడలేదు. తేజస్ ఫైటర్ స్క్వాడ్రన్లో పోస్టింగ్ పొందడంతో ఆయనలో విశ్వాసాన్ని బాగా పెంచిందట. ఇస్రో చరిత్రలో మేకింగ్ గగన్యాన్ ప్రొగ్రామ్ కోసం 12 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో కూడా చోటుదక్కించుకున్నారంటే వరుణ్ సింగ్ ఎంత ప్రతిభ కనబరిచారో అర్థం చేసుకోవచ్చు. టెంత్ క్లాస్, ఇంటర్, 12వ తరగతి మార్కులే ప్రాతిపదిక కాదు. మీ మార్కులు మీజీవితాన్ని శాసించలేవని వరుణ్ సింగ్ తన లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు కోట్లాదిమంది యువతను ఆలోచింపచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
-
Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!