టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది గులాబీ పార్టీ.. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభ మొదట ఈ నెల 15న నిర్వహించాలనుకున్నా.. కొన్ని కారణాలతో దానిని 29వ తేదీకి వాయిదా వేశారు.. తెలంగాణ దీక్షాదివస్ అయిన ఈ నెల 29వ తేదీన సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే, మరోసారి ఈ సభ వాయిదా పడింది.. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సెగ.. ఈ భారీ బహిరంగ సభను తాకింది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళే వెలువడింది.. దీంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.. దీని ప్రభావం వరంగల్లో నిర్వహించనున్న సభపైపై పడింది.. ఇక, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ మరోసారి తన భారీ బహిరంగసభను వాయిదా వేసుకుంది.
టీఆర్ఎస్ విజయగర్జన సభ మళ్లీ వాయిదా..
