NTV Telugu Site icon

బయటపడ్డ టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ నిర్వాకం.. పంచాయతీ నిధులు స్వాహా

గ్రామ పంచాయతీ నిధులు ఓ ఎంపీటీసీ స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్‌ జిల్లాలోని పూడూరు మండలం చీలాపూర్ సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేశాడో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీ. ఆ ఫోర్జరీ తో గ్రామపంచాయతీ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.57,701 నగదును తన భార్య ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఎవరికీ అనుమానం రాకుండా సదరు ఎంపీటీసీ ఆ ఖాతాను క్లోజ్ చేయించాడు. అయితే గత కొన్ని రోజులుగా గ్రామ అభివృద్ధికి చెందిన కొన్ని బిల్లులు రాకపోవడంతో అనుమానం వచ్చిన సర్పంచ్‌ బ్యాంక్‌కు వెళ్లాడు. ఇంకేముంది బ్యాంక్‌లో ఎంపీటీసీ చేసిన నిర్వాకం బయటపడింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.