హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు బీజేపీ అభ్యర్థి ఈటల వ్యవహారంపై ఈసీ తలుపుతట్టిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. మరోసారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేసింది.. బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని.. హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఇప్పటికే ఈటల అక్రమాలపై అనేక మార్లు పిర్యాదు చేశాం.. అయినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడైనా తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శశాంక్ గోయల్కు కోరారు.. ఇవాళ ఎస్ఈసీని కలిసిన టీమ్లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఉన్నారు. కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. హుజురాబాద్లో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు.