Site icon NTV Telugu

రేపే తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను బుధవారం ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను రేపు విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. థియరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3 నుంచి 7 వరకు ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.

Read Also: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌.. రేపటి నుంచే రైతుబంధు

కాగా మరోవైపు వచ్చే ఏడాది ఇంటర్‌ వార్షిక పరీక్షలను ఏప్రిల్‌ నెలలో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 2022 మార్చి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగాలి. అయితే ఈ ఏడాది కూడా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతుల ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version