Telangana : విద్యార్థులకు అలెర్ట్.. స్కూల్ టైమింగ్స్ మారాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. తెలంగాణాలో పరిస్థితి వర్ణనాతీతం.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, నాళాలు కలిసిపోయాయి.. ప్రజలు బయట కాలు పెట్టలేని పరిస్థితి.. తెలంగాణలో గత వారంలో భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారం, శనివారం స్కూల్స్ కు సెలవులు ఇచ్చారు.. ఇప్పుడు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.. దీంతో స్కూల్స్ ఉన్నాయా? లేదా? అనే సంధిగ్ధం లో విద్యార్థులు, తల్లి దండ్రులు ఉన్నారు..
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. రాష్ట్రంలోని సూళ్ల టైమింగ్స్లో మార్పులు చేసింది. ఇక నుంచి స్కూళ్లు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో.. ఇకపై ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్రైమరీ స్కూళ్లు, 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు అప్పర్ ప్రైమరీ స్కూళ్లు పనిచేయనున్నాయి. అయితే.. ఈ మార్పులు హైదరాబాద్ జంటనగరాల పరిధిలో ఉన్న పాఠశాలలు కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లకు వర్తించనున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా.. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది..
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
పనివేళల్లో మార్పులకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు విద్యాశాఖ పంపించింది. వారి పరిధిలోని ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.. ప్రైమరీ వాళ్ళకు ఆరోగ్య రీత్యా స్కూల్ టైమింగ్స్ కు మార్చినట్లు తెలుస్తుంది.. వారికి తప్పనిసరిగా ఉదయం 9.30 నుంచి 4.45 నిమిషాల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.. మంగళవారం నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు.. మరోవైపు భారీ వర్షాలు రాష్ట్రాన్ని వదలడం లేదు.. మరో మూడు రోజులు భారీ, నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూసిస్తున్నారు..
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..