సత్సంబంధాలు దెబ్బతీస్తున్న స్మార్ట్ఫోన్లు.. VIVO కొత్త అధ్యయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సమాజంలో అత్యాధునిక టెక్నాలజీతో రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తోంది. కాలంతో పాటు మనం కూడా మారాలంటూ ప్రజలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడిపోతున్నారు. అయితే తాజాగా సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) సహకారంతో ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజ సంస్థ వివో (VIVO) ‘స్మార్ట్ ఫోన్లు మరియు మానవ సంబంధాలు’ అనే కొత్త అధ్యయనాన్ని చేపట్టింది. న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా సహా టాప్ 8 భారతీయ నగరాలలోని తమ 1100 మంది కస్టమర్లతో ఓ సర్వే నిర్వహించింది. వినియోగదారులతో పాటు వారి సంబంధాలపై స్మార్ట్ఫోన్లు వాటి ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ సర్వేలో తేలింది. కనీసం 69 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్మార్ట్ఫోన్లలో మునిగితే వారి పని సాఫీగా సాగుతుందని, 74 శాతం మంది తమ పిల్లలు తమను ఏదైనా అడిగినప్పుడు చిరాకు పడుతున్నామని అంగీకరించినట్లు మంగళవారం ఒక నివేదికలో తెలిపింది.

స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగాన్ని ఉద్దేశించి వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డీజీఎం యోగేంద్ర శ్రీరాముల మాట్లాడుతూ ఏదైనా ప్రవర్తన మార్పులో మనకు అవసరమైన మొదటి అడుగు వేయడం చాలా కష్టమైన విషయం. ఈ సర్వే ద్వారా తెలిసిన విషయాలతో స్మార్ట్ఫోన్లపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అనుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
Also Read
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్కు వార్నింగ్
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం! మూసుకున్న న్యాయ మార్గాలు
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు

కోవిడ్ కంటే కోవిడ్ తరువాత స్మార్ట్ఫోన్లతో గడిపే వారి సంఖ్య 32 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ అనంతర కాలంలో స్మార్ట్ఫోన్ల కోసం వెచ్చించే సగటు రోజువారీ సమయం ఆందోళనకరమైన స్థాయిలోనే ఉందని సర్వేలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు. కోవిడ్ కాలంలో పిల్లలు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం దొరికినా.. ఆ సమయంలో కూడా స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడిపినట్లు సర్వేలో తేలిందని ఆయన అన్నారు.
కనీసం 80 శాతం మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు తమ పిల్లలతో సమయాన్ని గడుపుతున్నప్పడు కూడా తమ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. 75 శాతం మంది తమ స్మార్ట్ఫోన్ల ద్వారా పరధ్యానంలో ఉన్నారని మరియు వారితో ఉన్నప్పుడు కూడా పిల్లల పట్ల శ్రద్ధ చూపడం లేదని అంగీకరించారని ఆయన తెలిపారు. మొత్తానికి ఫోన్లపై ఆధారపడటం పెరిగింది. ఎన్ని టెక్నాలజీలు పెరిగిన మానవ జాతి కోసమే.. కానీ మర మనుషులతో సంబంధాలు పెంచుకోని మనషులను పట్టించుకోవడం లేదు. మీరు కూడా ఇలాంటి తప్పే చేస్తుంటే.. తప్పకుండా అవగాహన పెంచుకొండి..
తాజావార్తలు
-
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
-
CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
ట్రెండింగ్
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!