Site icon NTV Telugu

ఆర్టీసీ సిబ్బంది, కుటుంబ సభ్యులు రక్త దానం చేయాలి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్‌ క్యాంపును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త దానం చేశారు సజ్జనార్. అనంతరం ఆయన మాట్లాడుతూ… టీఎస్ ఆర్టీసీ యాజమాన్య ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ 97 డిపోలు 67 సొసైటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సర కాలంగా బ్లడ్ కొరత ఏర్పడుతుందని… తలేసిమియా వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషంట్స్, యాక్సిడెంట్ వారికి బ్లడ్ ఎంతో అవసరమని గుర్తు చేశారు.

నర్సంపేట డ్రైవర్ శ్రీనివాస్ ఇప్పటి వరకు 80 సార్లు బ్లడ్ డొనేట్ చేశారని… ఆయన చేత నర్సంపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభమైందని వెల్లడించారు. ఆర్టీసి సిబ్బంది, కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేట్ చేయాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యం… సిబ్బందికి 100 శాతం వ్యాక్సిన్ ఇచ్చిందని… కొత్త వేరియంట్ పై బయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు.

Exit mobile version