హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరోముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది కారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు.
శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. కారులో ప్రయాణిస్తున్న 6 మంది యువకులు. మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు గుర్తించారు. కారులో మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. మితి మీరిన వేగం, మద్యం మత్తులో కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు.
కారు ముందు సీటు లో ఇరుక్కుపోయింది ఓ యువతి. చాలా కష్టం మీద యువతిని బయటకు తీశారు ఓఆర్ఆర్ సిబ్బంది. కారు నెంబర్ AP 13N 5121. కారు లో ప్రయాణిస్తున్నది 5 మంది యువకులు, ఓ అమ్మాయి. వారిని డ్రైవర్ ప్రేమ్, కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైశ్వవిగా గుర్తించారు. ఈమధ్యకాలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మొయినాబాద్ లో మద్యం తాగి కారు నడిపి ఇద్దరు అమ్మాయిల మరణానికి కారణం అయ్యాడో పార్టీ నేత కుమారుడు.
