టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు రెండో మెడల్ వచ్చింది. భారత క్రీడాకారిణి పీవీ సింధూ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించింది వరుస ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. అయితే నిన్న సెమీస్లో చైనా ప్లేయర్ తైజుయింగ్ చేతిలో ఓడిన సింధూ.. ఇవాళ మరో చైనీస్ క్రీడాకారిణి బింగ్జియావోతో తలపడింది. ఈ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో బింగ్జియావో ను 21-13, 21-15 తో వరుస సెట్లలో ఓడించి భారత్ కు ఈ ఒలంపిక్స్ లో రెండో మెడల్ తెచ్చి పెట్టింది. దాంతో భారత రాష్ట్రపతితో సహా పలువురు సింధూకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక సింధూ పతకం గెలవడంపై తన తండి రమణ స్పందిస్తూ… బ్రాంజా.. సిల్వరా… గోల్డ్… కాదు.. పతకం ఏదైనా పతకమే.. సింధు దేశం కోసం ఆడింది… దేశానికి మెడల్ తెచ్చిపెట్టింది. నిన్న రాత్రి కాల్ చేసి మాట్లాడింది… పోయిన మ్యాచ్ గురించి వదిలేయ్. మరొక మెడల్ నీముందు ఉంది. అది సాధించే దిశగా ఆడమని ధైర్యం చెప్పాం అని పేర్కొన్నారు.