నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల తనిఖీలపై మండిపడ్డారు పీవో డబ్ల్యు సంధ్య. సాయంత్రం 5 గంటల సమయంలో మా ఇంటికి పోలీసులు వచ్చి మా భర్తను ప్రింటింగ్ ప్రెస్ కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ప్రింటింగ్ ప్రెస్ లో 50 మంది పోలీసులు వచ్చి బీభత్సం సృష్టించారన్నారు సంధ్య. ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న కంప్యూటర్లను, హార్డ్ డిస్క్ లను, ప్రింట్ అయిన పుస్తకాలను పోలీసులు తీసుకెళ్లారు.
మా భర్తను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఆర్కే భార్య తన భర్త జ్ఞాపకార్ధంగా ఒక బుక్ ప్రింట్ చేయమని ఇచ్చారు. ఆ బుక్ పై మా ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ తో ప్రింట్ చేశాము. అదేమైనా నేరమా.. RK చనిపోయాడు అతని బుక్కు ప్రింట్ చేస్తే తప్పేముంది? అన్నారు సంధ్య. సీజ్ చేసిన మెటీరియల్ అంతా వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మా భర్త మీద పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకొని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు సంధ్య.