మెగా కజిన్స్ సెల్ఫీ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కజిన్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముగ్గురూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ లో వీరు ముగ్గురూ పడుకుని ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దొరికిన ఖాళీ సమయంలో ఈ మెగా కజిన్స్ ముగ్గురూ ఒకే దగ్గర చేరినట్టు కన్పిస్తోంది. ఈ పిక్ ను మెగా అభిమానులు ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని” చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. జూన్ లేదా జూలైలో “గని” చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ యంగ్ హీరో “ఎఫ్ 3” చిత్రంలోనూ నటిస్తున్నాడు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Read Also : ‘మా’ అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు
Also Read
ఇక వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’. భారీ కలెక్షన్లతో వైష్ణవ్ తేజ్ కెరీర్లో మరిచిపోలేని చిత్రంగా మిగిలింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్… వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. సుకుమార్ ఆ రెండు చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ యంగ్ హీరో త్వరలో తన మూడవ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఎస్విసిసి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక వైష్ణవ్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వం వహించిన తన రెండవ చిత్రం ‘కొండపాలెం’ షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మెగా హీరోలంతా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!