Madhavilatha : హీరో ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత..ఫ్యాన్స్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ హీరోయిన్ మాధవిలత అందరికి తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసింది.. ప్రస్తుతం సినిమా అవకాశాలు తక్కువ అవ్వడంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు అందని ద్రాక్షలా మారింది.. ఇక ఈ మధ్య మాధవి లత పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూరుస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. ఎక్కువగా పవన్ కళ్యాణ్ కు సంబందించిన విషయాల గురించి మాట్లాడే ఈ అమ్మడు ఇప్పుడు ప్రభాస్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆదిపురుష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..
మొన్నీమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’ సినిమా ప్రేక్షకులను మెప్పించటంలోనూ.. జనాల్ని ఒప్పించటంలోనూ విఫలమైంది. రామాయణాన్ని ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించారంటూ దర్శకుడు ఓం రౌత్పై సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రోల్స్ ను అందుకుంటుంది.. ఈ సినిమా చాలా విషయాల్లో రామాయణానికి.. ఆదిపురుష్ సినిమాకు సంబంధం లేకుండా ఉందని, దేవుడి సినిమాను కమర్షియల్ సినిమాగా మార్చేశారని జనం మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సినిమాను బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ వివాదంపై హీరోయిన్ మాధవీలత స్పందించారు..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది.. ఆ పోస్ట్ లో రాముడి పాత్ర చేసిన ప్రభాస్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. సినిమా విషయంలో ప్రభాస్ది కూడా తప్పు ఉందని అన్నారు. ఆదిపురుష్ మ్యాటర్లో అందరూ డైరెక్టర్ని దొబ్బుతున్నారని, హీరో మ్యాటర్లో సైలెంట్ అయ్యారని అన్నారు. హీరోకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. స్టోరీ వినేటప్పుడు, తీసేటప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు తెలియలేదా అని అన్నారు.. ప్రభాస్ ఏమైనా కొత్తగా సినిమాలు చేస్తున్నారా..డైరెక్టర్ ఏదీ చెబితే అది చెయ్యడానికి కథ విన్నాడుగా అప్పుడే తెలియాలి కదా అంటూ తీవ్ర విమర్శలు చేసింది.. ఈ విషయంలో ఫ్యాన్స్ నన్ను ఏమన్నా పర్వాలేదు.. ప్రభాస్ దే తప్పు అంటూ రాసుకొచ్చింది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాధవీ లతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో జోలికి వస్తే ఊరుకునేది లేదని అంటున్నారు..ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చే నడుస్తుంది..ఈ విషయం పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..

తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!