Site icon NTV Telugu

శీతాకాల సమావేశాలు.. ఉభయసభలు నిరవధిక వాయిదా

Parliament

Parliament

పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు ఇవాళ నిరవధికంగా వాయిదా పడ్డాయి.. ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి.. శీతాకాల సమావేశాల్లో లోక్‌స‌భ‌లో 18 గంట‌ల 48 నిమిషాల పాటు స‌భా స‌మ‌యం వృథా అయిన‌ట్లు స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు. అయినా కీల‌క‌మైన బిల్లుల గురించి చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందిన‌ట్లు ఆయ‌న చెప్పారు. లోక్‌స‌భ‌లో ఒమిక్రాన్‌, వాతావ‌ర‌ణ మార్పులతో పాటు ఇత‌ర ముఖ్య అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు ఓం బిర్లా వెల్లడించారు.. ఇదే సమయంలో రాజ్యస‌భ‌ను కూడా నిర‌వ‌ధికంగా వాయిదా పడింది.. శీతాకాల స‌మావేశాలు అంచ‌నాల‌కు త‌గిన రీతిలో జ‌ర‌గ‌లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడు.. నిజానికి ఈ స‌మావేశాలు మ‌రింత బాగా జ‌ర‌గాల్సి ఉంద‌ని, ఎక్కడ త‌ప్పు జ‌రిగిందో స‌భ్యులో ఆత్మావ‌లోక‌నం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు న‌వంబ‌ర్ 29వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే కాగా.. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబ‌ర్ 23వ తేదీ వ‌ర‌కు జరగాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే స‌మావేశాల‌ను నిరవధికంగా వాయిదా వేశారు.

https://ntvtelugu.com/mandatory-employee-vaccines/
Exit mobile version