కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఠాగూర్ తన పైన చిన్న చూపు చూస్తున్నారని.. తెలంగాణలో బలమైన నాయకుడిగా ఠాగూర్ నన్ను గుర్తించకపోవడం నా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పీసీసీ అడుగుతున్నా.. ఢిల్లీ చర్చలో తన పేరు లేకపోవడం దురదృష్టమన్నారు. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే బాంబే హైవే మీద కేసీఆర్ ను అడ్డగించిన చరిత్ర తనది అని.. ఇది ఠాగూర్ కు తెలువక పోవడం తన దురదృష్టం అని పేర్కొన్నారు. రాజకీయంగా కేసీఆర్ ను అడ్డుకోవడం తనతోనే సాధ్యమని..కేసీఆర్ ను గద్దె దింపే మెడిసిన్ తన దగ్గర ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చెబుతున్నది కామెడీ కాదు సీరియస్ అని..క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. వి.హెచ్ ను కొందరు బెదిరించడాన్ని ఖండిస్తున్నానని.. బెదిరించేవారు ఫోన్ నంబర్ పెట్టాలని.. నేను వచ్చి మాట్లాడతానని వెల్లడించారు. ఫేస్ బుక్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు జగ్గారెడ్డి.