Site icon NTV Telugu

ఈటలకు షాక్‌.. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం..

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 723 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్‌ఎస్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు.

అనంతరం ఈవీంఏంలలో ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్‌లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్‌ నుంచి ఏడో రౌండ్‌ వరకు బీజేపీ లీడ్‌లో ఉండగా.. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. ఎనిమిది రౌండ్ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ 162 ఓట్ల లీడ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 3,270 ఓట్ల మెజార్టీతో ఉంది.

Exit mobile version