Site icon NTV Telugu

ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బిగ్‌బాస్‌ షోతో బుల్లితెర అభిమానులను అలరించిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోతో మరోసారి అభిమానులను సంతోషపరుస్తున్నాడు. ఇప్పటికే ఈ షో కోసం పలువురు గెస్టులు హాజరై ఎన్టీఆర్‌తో మాటామంతీ కలిపారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, హీరోయిన్ సమంత… ఇలా సెలబ్రిటీలు ఎన్టీఆర్‌ షోకు హాజరయ్యారు.

Read Also: భారీ స్థాయిలో అఖండ ప్రి రిలీజ్ బిజినెస్.. బాలయ్య కెరీర్‌లో ఇదే తొలిసారి

అయితే త్వరలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోలను జెమినీ టీవీ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా కొద్దిరోజుల్లో టీవీలో ప్రసారం కానుంది. ఈ షోలో మహేష్ రూ.25 లక్షలు గెలుచుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మొత్తాన్ని మహేష్ ఛారిటీ కోసం కేటాయించి మంచి మనసు చాటుకున్నాడట. ఈ షోలో సెలబ్రిటీలు ఎవరు పాల్గొన్నా… వారు గెలుచుకున్న మొత్తాన్ని ఛారిటీకే ఇవ్వాలని షో నిర్వాహకులు రూల్ పెట్టిన సంగతి తెలిసిందే.

Exit mobile version