బిగ్బాస్-5: వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకున్న హీరో నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న టీవీషో బిగ్ బాస్ హౌస్లో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నినాదం మార్మోగింది. యువ ప్రతిభావంతులైన నటులకు, వారి ప్రజ్ఞాపాటవాలకు బిగ్బాస్ షో ద్వారా ముగ్ధులవుతున్న కోట్లాదిమంది ప్రజానీకానికి ఒక మంచి సందేశం అందించాలనే తలంపుతో నిర్వాహకులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఇందులో భాగం చేశారు. ఈ నేపథ్యంలో పచ్చదనమే రేపటి ప్రగతి పథమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. ‘ఈ సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా మూడు వారాల సమయం ఉందని.. ఇప్పటి వరకు ఎన్నో చేసుంటాం కానీ, ఈ మూడు వారాలు.. వారానికి ఒకటి చొప్పున మూడు మొక్కలు నాటి 2021కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలి‘ అంటూ నాగార్జున హౌస్లోని కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. అంతేకాదు మొక్కలు నాటడమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను బిగ్బాస్ స్టేజీపైకి ఆహ్వానించారు.

గత ఐదేళ్లుగా మొక్కలు నాటడం, నాటించడం ఒక దినచర్యగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటిన రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను నాగార్జున అభినందించారు. ఒక్క మనిషి తన ఆలోచనతో, ప్రకృతి బాగుండాలనే తపనతో కోట్లాది మొక్కలు నాటితే.. బిగ్ బాస్ హౌస్ పిలునిస్తే ఇంకా ఎన్ని కోట్ల మొక్కలు నాటొచ్చో ఊహించుకోండని ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేశారు. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టి భవిష్యత్ తరాలు ఈ భూమిపై మనుగడ సాగించాలంటే.. మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని నాగార్జున ప్రేక్షకులకు సూచించారు.
Also Read
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్

అనంతరం ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మొక్కలు నాటాలి, కాపాడాలి అనే ఆలోచనను కలిగించాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. ‘ఒకచోట ఒకరు ఒకటి రెండు మొక్కలు నాటారు, మరోచోట టీంలుగా కొంతమంది కలిసి మొక్కలు నాటారు. ఇక స్టార్స్, సెలెబ్రెటీలు అయితే ఫారెస్ట్ లను దత్తత తీసుకున్నారు. హీరో ప్రభాస్ 1643 ఎకరాలు, హెటిరో డ్రగ్స్ పార్ధసారథి రెడ్డి 2500 ఎకరాల అడవులను దత్తత తీసుకుని మొక్కల్ని పెంచుతున్నారు. మేం నిరంతరం మొక్కల యజ్ఞం చేస్తున్నాం. శక్తి ఉన్నంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తునే ఉంటాం, మా ఈ ప్రయత్నం ఈరోజు మీ ద్వారా కోట్లమందికి చేరింది. ఇంత అద్భుతమైన షోలో మా గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు భాగస్వామ్యం కల్పించిన నాగార్జున గారికి, స్టార్ మాటీవీ వారికి, బిగ్ బాస్ నిర్వాహకులకు, కంటెస్టెంట్లకు, టెక్నిషీయన్లకు కృతజ్ఞతలు’ అంటూ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడారు.

చివరగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వారి మాటలు, స్పూర్తి తనను ఎంతో కదిలించాయన్నారు. తాను కూడా వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్టును దత్తత తీసుకుంటానని.. సంతోష్ కుమార్ ఎక్కడ చూపెడితే అక్కడ అడవిని దత్తత తీసుకుని మొక్కలను పెంచుతానని తెలిపారు. సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని నాగార్జున పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!