Site icon NTV Telugu

Google employees: గూగుల్ సీఈఓ పిచాయ్‌కి ఉద్యోగుల లేఖ

Google Ceo

Google Ceo

గూగుల్ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కి లేఖ రాశారు. గూగుల్ మాతృసంస్థ అల్భాబెట్‌లో పనిచేసే 1400 మందికిపైగా ఉద్యోగులు.. పలు డిమాండ్లను సీఈఓ సుందర్ పిచాయ్ ముందు ఉంచారు. ఇటీవల ఆఫ్స్ ప్రక్రియలో భాగంగా గూగుల్ సుమారు 12 వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడానికే ఇలా చేస్తున్నట్లు వెల్లడించింది.ఈ నేపథ్యంలో గూగుల్ ఉద్యోగులు ఏకమయ్యారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్‌ని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు.
Also Read: IND VS AUS: రేపే రెండో వన్డే మ్యాచ్.. విశాఖలో వ‌రుణుడి ఆటంకం?

ఉద్యోగులు కొత్త నియామకాలను స్తంభింపజేయడం, స్వచ్ఛంద తొలగింపులను కోరడం, ఉద్యోగ ఖాళీల కోసం తొలగించబడిన కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం, షెడ్యూల్ చేసిన కాలాలను పూర్తి చేయడానికి కార్మికులను అనుమతించడం వంటి అనేక డిమాండ్లను ఉద్యోగులు చేశారు.పేరెంటల్, బిరేవ్‌మెంట్ లీవ్స్‌కు సంబంధించి చెల్లింపులు పూర్తి చేయడం వంటి డిమాండ్లను ఉద్యోగులు ప్రస్తావించారు.
Also Read: World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌.. ఓ ఇంటివాడయ్యాడు..

ప్రస్తుతం సంఘర్షణలు జరుగుతున్న, మానవతా సంక్షోభం నెలకొన్న ఉక్రెయిన్‌ వంటి ప్రాంతాల్లో ఉద్యోగులను తొలగించవద్దని కోరారు. ఆ దేశాల్లో వారికి ఉద్యోగం పోతే వీసా లింక్డ్ రెసిడెన్సీ పోతుందని చెప్పారు. “కార్మికుల స్వరాలు ఎక్కడా తగినంతగా పరిగణించబడలేదు మరియు కార్మికులుగా మేము ఒంటరిగా కంటే కలిసి బలంగా ఉన్నామని మాకు తెలుసు.” అని లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు.

Exit mobile version