ఈక్వెడార్ లోని ఓ జైలులో రెండు ముఠాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో 68 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈక్వెడార్లోని తీరప్రాంతమైన గుయాక్విల్లోని జైలులో ఆ దారుణం చోటుచేసుకున్నది. గుయాక్విల్ జైలులో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని, డ్రగ్స్కేసులో బుక్ అయిన వారిని ఉంచుతారు.
Read: ధాన్యం కొనుగోలుపై బీజేపీ యుద్ధం
అయితే, డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్న రెండు ముఠాల మధ్య మొదలైన రడగ ఘర్షణగా మారింది. కత్తులతో దాడులు చేసుకున్నారు. గన్ ఫైరింగ్లకు పాల్పడ్డారు. దాదాపు 8 గంటల పాటు గుయాక్విల్ లో ఆ ఘర్షణలు జరిగాయి. ముఠాల మధ్య ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసులను రంగంలోకి దించడంతో గొడవలు సద్దుమణిగాయి. జైల్లో జరిగిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.