EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ వడ్డీరేటు పెంచిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్రం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)కి సంబంధించిన అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేసింది. పీఎఫ్ వడ్డీ రేటును స్వల్పంగా పెంచి 8.15 శాతానికి చేర్చింది. గతంలో వడ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. తాజాగా పెంచిన వడ్డీ రేట్లు 2022-23 పీఎఫ్ డిపాజిట్లపై వర్తిస్తుంది. పీఎఫ్ అకౌంట్లో ఉన్న నగదు నిల్వపై ఈ వడ్డీ జమ అవుతుంటుంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Gold prices: గోల్డెన్ ఛాన్స్ .. తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే
2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ (PF)పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్పై ఇదే తక్కువ వడ్డీ రేటు. అయితే, ఇప్పుడు మరో 0.05 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రెండు రోజుల సమావేశం తర్వాత, ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీలో 0.05% పెంచాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు. 2022-23కి వర్తించే కొత్త రేటు 8.15%గా ఉంటుంది.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ (EPFO) చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత వడ్డీ రేటు అధికారికంగా ప్రభుత్వ గెజిట్ విడుదల అవుతుంది. అనంతరం EPFO తన చందాదారుల ఖాతాల్లో వడ్డీ రేటును జమ చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఆదాయం మొత్తంలో వృద్ధి వరుసగా 16%, 15% కంటే ఎక్కువ అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read:Fake certificates: నకిలీ సర్టిఫికెట్ల జారీ స్కాంలో కీలక మలుపు
కాగా, మార్చి 2020లో EPFO ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19కి అందించిన 8.65% నుండి 2019-20కి ఏడేళ్ల కనిష్ట స్థాయి 8.5%కి తగ్గించింది. EPFO తన చందాదారులకు 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేట్లను అందించింది. 2015-16లో వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా 8.8 శాతంగా ఉంది. పదవీ విరమణ నిధి సంస్థ 2013-14, 2014-15లో 8.75% వడ్డీ రేటును ఇచ్చింది. 2012-13కి 8.5% కంటే ఎక్కువ. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!