ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం నేడు ఘనంగా జరుగుతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్తో కలిసి ఆమె కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈమేరకు వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శంకర్ అభిమానులు వారికీ విషెస్ తెలియచేస్తున్నారు.
Read Also: 40 ఏళ్ళ ‘ప్రేమకానుక’
ఇక రోహిత్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్లో ఆడుతున్నాడు. రోహిత్ తండ్రి రామోదరన్ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్ టీంకు స్పాన్సర్ కూడా వ్యవహరిస్తున్నాడు. శంకర్ కూతురు ఐశ్యర్య వృత్తిరీత్యా వైద్యురాలు. కాగా శంకర్కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్. ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్ 2’ మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.