Site icon NTV Telugu

వైఎస్సార్ 12వ వర్ధంతి.. వైఎస్‌ జగన్‌ భావోద్వేగం..

దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికన ఓ పోస్టు చేశారు వైఎస్ జగన్.. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది.” అంటూ ట్వీట్ చేశారు. ఇక, ఇడుపులపాయకు తన కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. తన తండ్రి వైఎస్సార్ సమాధి దగ్గర నివాళులర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Exit mobile version