అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. యూపీ ఎన్నికలు జరిగేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది.. పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఉత్తారాఖండ్, గోవా, మణిపూర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు మొదలయ్యాయి.. ఒమిక్రాన్ విజృంభిస్తోన్న సమయంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా వేస్తారా? అనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారం, సభలు అంటే వేలాదిగా మంది గుమిగూడే పరిస్థితి ఉంటుంది.. వేగంగా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉంటుంది.. దీంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఒమిక్రాన్ విస్తరిస్తోండడంతో.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికలను రెండు, మూడు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను రిక్వెస్ట్ చేసింది.
అలాగే రాష్ట్రంలో జరిగే బహిరంగసభలు, ర్యాలీపై నిషేధం విధించాలని ప్రధాని నరేంద్ర మోడీని కూడా కోరింది అలహాబాద్ హైకోర్టు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. అందుకే ర్యాలీలు నిలిపివేయాలని కోరింది. లేదంటే యూపీలో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసిన అలహాబాద్ హైకోర్టు.. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేయాలని కోరింది. కరోనా కేసులు పెరగకుండా.. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక, ర్యాలీలు, బహిరంగ సభలు, కార్యక్రమాలపై నిషేధం విధించాలని సూచించిన కోర్టు.. ఎన్నికల కోసం ప్రచారం చేయాలనుకుంటే రాజకీయ పార్టీలు టీవీలు, న్యూస్ పేపర్లనూ ఎంచుకోవచ్చు అని అభిప్రాయపడింది.. ప్రాణాలు ఉంటేనే మిగతా అంతా కూడా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. దీంతో.. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేస్తుందా..? హైకోర్టు సూచలన ప్రకారం యూపీ సహా మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
- Tags
తాజావార్తలు
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
-
West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
-
Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?