కుప్పం పోలింగ్కి సర్వం సిద్ధం..24 వార్డులకు రేపే ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు. నిత్యం వివాదాలమయంగా మారాయి ఇక్కడి ఎన్నికలు. అటు అధికార, విపక్షాలు ఇక్కడి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుప్పం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత ఇలాకా కావడంతో అక్కడ ప్రజాతీర్పు ఎలా వుంటుందోనని యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
కుప్పం మున్సిపాలిటీ కి సంబంధించిన 24 వార్డులలో సోమవారం నాడు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎన్నికల అధికారి చిట్టిబాబు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ లో మొత్తం 25 వార్డులు ఉండగా ఒక వార్డు ఏకగ్రీవం అయిందని 24 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల కోసం 48 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం 48 మంది పోలింగ్ అధికారులు, 48 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 96 మంది పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందని చిట్టిబాబు చెప్పారు.
Also Read
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏడుగురు ఎన్నికల అధికారులు, ఏడుగురు అదనపు ఎన్నికల అధికారులు, మరో ఏడుగురు సహాయ ఎన్నికల అధికారులు విధుల్లో వున్నారు. కుప్పంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మొత్తం 48 పోలింగ్ కేంద్రాలలో 16 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 22 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు.
ఈ ప్రాంతాలలోని ఒక్కో పోలింగ్ కేంద్రానికి పదిమంది పోలీసులు ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్యాలెట్ పేపర్ పద్దతిలో జరిగే పోలింగ్ లో మొత్తం మున్సిపాలిటీలో 39,259 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను చేరుకుంటున్నారని చిట్టిబాబు తెలిపారు.పోలింగ్ అనంతరం ఎం సి జె డిగ్రీ కళాశాలకు తరలించి భద్రపరుస్తారని,అనంతరం 17 వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!