Site icon NTV Telugu

Horseshoe Crab: 45 కోట్ల ఏళ్లుగా భూమిపై జీవి.. 1 లీటర్ రక్తం ధర రూ.12.58 లక్షలు!

Horseshoe Crab

Horseshoe Crab

ప్రపంచంలోనే ఓ జీవి రక్తానికి అత్యధిక ధర పలుకుతుంది. దాని పేరు “హార్స్ షూ క్రాబ్”. ఈ ప్రత్యేకమైన పీత రక్తం ప్రత్యేక రంగులో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని రక్తం వైద్యరంగంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ధర లక్షల్లో ఉంటుంది. వాస్తవానికి.. ఈ రక్తంలో ఒక ప్రత్యేక మూలకం కనుగొనబడింది. ఇది మందులు, ఇంజెక్షన్లలో బ్యాక్టీరియాను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. హార్స్‌షూ పీతలు వాటి గుర్రపుడెక్క లాంటి ఆకారం నుంచి పేరు పొందాయి. ఇది డైనోసార్ల కంటే పాత జీవిగా చెబుతారు. ఇది దాదాపు 45 కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఉంది. దాని రక్తం యొక్క రంగు నీలం. కారణం హిమోసైనిన్ అనే శ్వాసకోశ వర్ణద్రవ్యం ఇందులో ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం రాగిని కలిగి ఉంది. ఒక లీటర్ గుర్రపుడెక్క పీత రక్తం ధర దాదాపు 15 వేల డాలర్లు అంటే దాదాపు 12 లక్షల 58 వేల రూపాయలు పలుకుతుందట.

READ MORE: Palla Srinivas: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..!

రక్తం నుంచి బ్యాక్టీరియా ..
గుర్రపుడెక్క పీతల రక్తంలో అతి సూక్ష్మమైన బ్యాక్టీరియాను కూడా గుర్తించవచ్చని 1960లలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పటి నుంచి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, శస్త్రచికిత్సా పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ప్రతి పీత నుంచి దాదాపు 30% రక్తం సంగ్రహించబడుతుందట. ఒక నివేదిక ప్రకారం.. వైద్య అవసరాల కోసం ప్రతి సంవత్సరం 60 లక్షల గుర్రపుడెక్క పీతలు పట్టుబడుతున్నాయి. రక్త తీస్తుండగా.. దాదాపు 30 శాతం పీతలు చనిపోతాయట. మిగిలిన పీతలను తిరిగి సముద్రంలోకి వదిలేస్తారు. అయితే అవి పూర్తిగా కోలుకుంటాయో లేదో ఎవరికీ తెలియదు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) అమెరికన్ హార్స్‌షూ పీతను 2016లో దాని రెడ్ లిస్ట్‌లో ‘హార్స్‌షూ’ విభాగంలో ఉంచింది. త్వరలో ఇది అంతమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Exit mobile version