NTV Telugu Site icon

Maharashtra: ప్రాణం తీసిన చెట్టు.. వృక్షం నేలకూలి ఏడుగురు దుర్మరణం

Massive Tree

Massive Tree

మహారాష్ట్రలోని అకోలాలో ఆదివారం ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. అకోలా జిల్లాలోని పరాస్‌లో మతపరమైన వేడుకల కోసం కొంతమంది గుమిగూడిన సమయంలో టిన్ షెడ్‌పై చెట్టు పడి కొందరు భక్తులు మృతి చెందారు. ఈ సంఘటన సాయంత్రం 7 గంటల సమయంలో ఆలయం ముందు జరిగిన ఒక మతపరమైన వేడుకలో జరిగింది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా పాత వేప చెట్టు ఒక టిన్ షెడ్‌పై పడిపోయింది.
Also Read: Jail Restaurant: బెంగళూరులో సెంట్రల్ జైల్ రెస్టారెంట్.. ప్రత్యేక ఏంటో తెలుసా ?

దాని కింద భక్తులు ఉన్నారు. 35 నుంచి 40 మంది షెడ్డు కింద చిక్కుకున్నారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురిని అకోలా మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లు వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా సమన్వయం చేశారు. గాయపడిన వారిలో కొందరిని జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు, స్వల్పంగా గాయపడిన వారికి బాలాపూర్‌లో చికిత్స అందిస్తున్నారు.
Also Read:Summer Effect: ఏపీలో నేడు, రేపు వడగాల్పులు ..వాతావరణ శాఖ వార్నింగ్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టగా, జెసిబి యంత్రాలను తెప్పించి చెట్టు కొమ్మను, కూలిన షెడ్డును పైకి లేపారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతికి సంతాపం తెలిపారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తుందని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయించారు.