20 ఏళ్ళ ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 14తో ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’కు 20 ఏళ్ళు)
తొలి చిత్రం ‘బద్రి’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్నారు పూరీ జగన్నాథ్. రెండో చిత్రం ‘బాచీ’ బాల్చీ తన్నేసింది. ‘బాచీ’ ద్వారా చక్రిని సంగీత దర్శకునిగా పరిచయం చేశారు పూరి. మధ్యలో ‘యువరాజా’ అనే కన్నడ సినిమా తీశాక, ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ తెరకెక్కించారు జగన్నాథ్. ఈ సినిమాతో రవితేజ హీరోగా నిలదొక్కుకున్నారు. చక్రి సంగీత దర్శకునిగా సెటిల్ అయిపోయారు. ఈ మూవీ తరువాత పూరీ జగన్నాథ్ కొన్ని వరుస విజయాలు చూశారు. 2001 సెప్టెంబర్ 14న ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ జనం ముందు నిలచి, వారి మనసులు గెలిచింది.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ – టైటిల్ లోనే వైవిధ్యం చూపించిన పూరీ జగన్నాథ్ కథలోనూ వరైటీ కోసమే తపించారు. వైజాగ్ సముద్ర తీరాన ఉండే మరణశిఖరం ఎక్కి చావాలనుకుంటాడు సుబ్రమణ్యం. అక్కడ శ్రావణి తారసపడుతుంది. ఇద్దరూ ఒకరికొకరు తాము ఎందుకు చావాలనుకున్నారో తెలుపుకుంటారు. తరువాత సుబ్రమణ్యం గదికి వెళ్ళి నిద్రమాత్రలు మింగి చావాలనుకుంటారు. ఇంటి ఓనర్ పుణ్యాన ఆసుపత్రిలో వారి ప్రాణాలు గట్టెక్కుతాయి. తరువాత శ్రావణి ఓ ఆఫీసులో ఉద్యోగంలో చేరుతుంది. ఆమె ఓనర్ కూతురు సుబ్రమణ్యంను చూసి అతనితో జీవితం పంచుకోవాలని ఆశపడుతుంది. సుబ్రమణ్యంకు పెళ్ళయినట్టు శ్రావణికి చెబుతుంది. ఆమె కూడా అది నమ్ముతుంది. కానీ, సుబ్రమణ్యంకు అసలు విషయం తెలిసి ఓనర్ కూతురును నిలదీస్తాడు. వారిద్దరి జీవితాలకు దూరంగా ఉండాలని శ్రావణి ఊరెళ్ళి తన మేనమామనే పెళ్ళి చేసుకుంటుంది. ఆ సమయానికే అక్కడకు వచ్చిన సుబ్రమణ్యం, శ్రావణి మేనమామలను చావతన్ని ఆమెను తీసుకుపోతాడు. ‘తాళి కట్టించుకోవడం కాదు, అది కట్టిన వ్యక్తి మనసు ముఖ్యం…’ అంటాడు సుబ్రమణ్యం. అయినా శ్రావణి కొండపై నుండి దూకుతుంది. ఆమెతో పాటు సుబ్రమణ్యం. ఇద్దరూ ఓ వలలో చిక్కుకుంటారు. మళ్ళీ ప్రాణాలు నిలుస్తాయి. ఇద్దరూ తమ కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ వెళ్తూండగా కథ ముగుస్తుంది.
కథలో వైవిధ్యం చూపించడమే కాదు, సన్నివేశాల్లోనూ అలాగే సాగారు పూరి. అందువల్లే ఈ చిత్రం ద్వారా పూరీ జగన్నాథ్ కు ఉత్తమ కథకునిగా నంది అవార్డు లభించింది. ఇందులో రవితేజ, తనూరామ్, సమ్రిన్, అనంత్, అన్నపూర్ణ, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, కల్పనారాయ్, ఉత్తేజ్, జీవా, ధర్మవరపు, జీవీ, రఘు కుంచె నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించారు. వేణుగోపాల్ రెడ్డి, శేషు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో చక్రి బాణీలకు తగ్గ పాటలను సాహితీ, చంద్రబోస్, కందికొండ, భాస్కరభట్ల రవికుమార్ పలికించారు. ఇందులోని “మళ్ళి కూయవే గువ్వా…”, “రామసక్కని బంగారిబొమ్మా…”, “ఏమేమవునో…”, “పిల్లో పిసినారి పిల్లో…” వంటి పాటలు జనాన్ని భలేగా అలరించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!