జార్జి రెడ్డి, పలాస 1978 వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు తిరువీర్. ఆ తర్వాత మసూద, పరేషాన్ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తిరువీర్ కెరీర్లో మసూద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా వరుస సినిమాలు ఎంచుకోకుండా చాలా సెలెక్టివ్గా సినిమాలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తిరువీర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అనే సినిమాలో ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఇక తిరువీర్ తన కొత్త సినిమా గురించి మాట్లాడుతూ.. “వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్ర పోషించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొబైల్తో చాలాసార్లు ఫోటోలు తీశా, కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా నటించడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్గా అనిపిస్తోంది.
స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎలా పట్టుకోవాలి ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ అరకులో జరిగింది. అక్కడి చలి తీవ్రతను తట్టుకుని మరి టీం అంతా ఎంతో కష్టపడి సినిమాను షూట్ చేశామని అన్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా తిరువీర్ ‘భగవంతుడు’ అనే మరో ప్రాజెక్ట్ని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్తో తిరువీర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇక తిరువీర్ తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ..‘మసూద తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాల్ని, కథల్ని ఎంచుకుంటున్నాను. నాకు సరిపోయే కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కావడంతో ఆయా పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నాను. దర్శకనిర్మాతలు నా కోసం పాత్రలు, కథలు రాస్తుండటం ఆనందంగా ఉంది. ఇదే ఓ నటుడికి గొప్ప విజయం’ అని అన్నారు.