అమ్నేసియా పబ్ కేసు విషయమై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించింది. సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీకి మహిళ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేసు రిపోర్ట్ చూసిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.
జూబ్లీహిల్స్ బాలికపై సామూహిక లైంగికదాడి ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు శనివారం బాధితురాలి వీడియోలు మీడియాకు విడుదల చేయగా, ఆదివారం మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. బెంజ్కారులో నలుగురు యువకులతో కలిసి బాధితురాలు సన్నిహితంగా ఉన్న ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. బాలిక వీడియోలను వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు లో టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారింది. ఇప్పటికే ఇన్నోవా కార్ లో లభించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. కార్ లో సరిపడా ఆధారాలు లభించకపోవడంతో టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి సారించిన పోలీసులు. నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ , సీసీ ఫుటేజ్ లు, నిందితుల మొబైల్ టవర్ లొకేషన్ లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీకి మహిళ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో .. ఈఘటపై మరింతగా ఆసక్తి రేకిస్తోంది.
Harish Rao: నారాయణపేటలో పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన