Site icon NTV Telugu

Vemulawada : LED స్క్రీన్ల ద్వారే రాజన్న దర్శనం

Vemulawada Temple

Vemulawada Temple

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా స్వామి వారి దర్శనాన్ని భక్తులు పొందేలా చర్యలు తీసుకున్నారు. అర్చకులు, వేదపండితుల సూచనల మేరకు ఈ తాత్కాలిక దర్శన ఏర్పాట్లను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం కొనసాగుతుందని తెలిపారు. దేవాదాయ శాఖ సమాచారం ప్రకారం, భక్తుల కోసం అర్జిత సేవలు కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక సేవలు, ప్రసాదాల పంపిణీ, వసతి సదుపాయాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా, రాబోయే మేడారం జాతరకు వచ్చే భక్తులు కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ తాత్కాలిక దర్శన ఏర్పాట్లు అమల్లో ఉండనున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సౌకర్యాలు జనవరి 2026 వరకు కొనసాగుతాయి. భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడం, దర్శనంలో అంతరాయం కలగకుండా ఉండడం లక్ష్యంగా దేవాదాయ శాఖ ఈ చర్యలు చేపట్టిందని అధికారులు వివరించారు.

Why Can’t I Sleep: మీకు నిద్రపట్టకపోడానికి కారణాలు తెలుసా?

Exit mobile version