NTV Telugu Site icon

దిశ కేసు: సిర్పూర్‌కర్ కమిషన్ విచారణకు సజ్జనార్..

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘దిశ’ ఘటన సంచలనం సృష్టించింది.. హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై అప్పట్లో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. అయితే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల జస్టిస్‌ వీఎస్‌ సిర్పూర్ కర్ కమిషన్‌ నియమించింది.. ఆ కమిషన్‌ విచారణ తిరిగి ప్రారంభం కానుండగా.. ఇవాళ అత్యంత కీలకంగా మారింది.. దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ఇవాళ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరుకానున్నారు. సుమారు 30 ప్రశ్నలను విచారణ కమిటీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.. సజ్జనార్‌ ఈ రోజు విచారణకు హాజరు కావాలని జ్యుడీషియల్ కమిషన్ ఆదేశించింది.. ఎన్‌కౌంటర్‌ ఘటనపై సజ్జనార్‌ స్టేట్‌మెంట్‌ను నమోదు చేయనుంది కమిషన్.. ఇక, ఇప్పటికే ఎన్‌కౌంటర్‌ బాధిత కుటుంబాలు, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాంగ్మూలాలు నమోదు చేసింది కమిషన్‌.. అయితే, ఈ కేసులో కీలకంగా మారనుంది సజ్జనార్‌ స్టేట్‌మెంట్..