NTV Telugu Site icon

రామప్ప దేవాలయం అభివృద్ధి చేస్తాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అతి ప్రాచీన కట్టడం అయిన రుద్రేశ్వర దేవాలయము అభివృద్ధికి పాటుపడతానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత.. విద్యావతి తన దగ్గరకు వచ్చి మొదటి విషయం చెప్పిన అంశం రామప్ప దేవాలయం గురించే అన్నారు.

చాలా దేశాలు రామప్ప దేవాలయం ను వ్యతిరేకించాయని, అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపు కు అడ్డుకున్నాయో వాటి ద్వారానే అద్భుత కట్టడం అని చెప్పించిన ఘనత ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుందన్నారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు.

కరోనా వచ్చినప్పుడు మందుల కోసం ఇతర దేశాల వైపు చూశారు. కానీ మనం మంత్రం వేరే దేశాల వైపు చూడలేదు. యువత మేధావి మీదా నమ్మకం పెట్టుకొని స్వదేశం లో వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం.అంతే కాదు ఈరోజుకు 100 కోట్ల డోసులు ప్రజలకు ఇచ్చాం. ఇక నుండి 12 ఏళ్ల వయస్సు వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామన్నారు. రామప్ప దేవాలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని, టూరిజం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణ లోని ఆలయాలు.. టూరిజం అభివృద్ధి చేశామన్నారు.

వరంగల్‌ కోట, వెయ్యి స్తంభాల గుడి కి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి.. అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా కారణంగా విదేశీ టూరిస్టులు రావడంలేదు. కరోనా తగ్గుముఖం పట్టడం తో విదేశీ టూరిస్టులు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారన్నారు మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ ఎయిర్ పోర్టు ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం సుముఖంగా వుందని, ఎయిర్ పోర్టు వస్తే టూరిజం మరింతగా పెరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తక్కువ ఛార్జీలతో వరంగల్ కి విమానాలను నడుపుతామని, ఉడాన్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా రాయితీ ఇస్తామన్నారు మంత్రి కిషన్ రెడ్డి. అంతకుముందు ములుగులో గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి.