తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మాతృమూర్తులకు గొప్ప సదావకాశాన్ని కల్పిస్తోంది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆదివారం ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమని, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్ వెల్లడించారు. మదర్స్ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సామాజిక దృక్ఫథంతోను అడుగు ముందుకేస్తోందని, ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక రాయితీలు కూడా కల్పిస్తున్న వైనాన్ని ఆర్టీసీ అధికారులు గుర్తు చేశారు. ఇప్పటికే చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి అవకాశాలు కల్పించారు. నిరుద్యోగ యువతకు కూడా పాస్లలో 20 శాతం రాయితీ అందిస్తున్నారు. అలాగే మాతృదినోత్సవం రోజున ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు, మాతృమూర్తులు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
#TSRTC is delighted to present a special offer to celebrate the day & give them a unique experience of FREE TRAVEL in all the bus services, including AC services. #mothers travelling with children below five years can avail the offer on 8th May, 2022 #MothersDay2022 pic.twitter.com/X1EpYeMt07
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 6, 2022
