Site icon NTV Telugu

CM Revanth Reddy: 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలు?

Indian Gas Cylinder Revanth Reddy

Indian Gas Cylinder Revanth Reddy

CM Revanth Reddy: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ఫిబ్రవరి 27 నుంచి అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే ఈ పథకంలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. నగదు బదిలీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రకారం… గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు లబ్ధిదారులు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ నిర్ణయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Read also: Top Headlines@1PM: టాప్‌ న్యూస్

కొత్త గ్యాస్ కనెక్షన్లకు 500 గ్యాస్ సిలిండర్ పథకం వర్తించదని అధికారులు తెలిపారు. పాత కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న వారికే గ్యాస్ సబ్సిడీ అమలు చేస్తామన్నారు. గత మూడేళ్లలో లబ్ధిదారులు వినియోగించిన సిలిండర్ల సంఖ్య ఆధారంగా సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఖరారు చేస్తారు. ప్రస్తుతం 40 లక్షల మంది మహిళా లబ్ధిదారులను గుర్తించారు. వారితో ఈ నెల 27న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్యాస్ సబ్సిడీ చెల్లింపులకు NPCI వేదికగా వ్యవహరిస్తుండగా, SBI నోడల్ బ్యాంక్. అయితే ఈ పథకం అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో పౌరసరఫరాల సంఘం సమావేశం నిర్వహించింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు అధికారులకు తెలియజేశారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆయిల్ కంపెనీల అనుమతి తీసుకోవాలన్నారు. ఇందులో ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ మోసం చేసే అవకాశాలు ఉండడంతో… నేరుగా ఖాతాల్లోకే నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read also: Begumpet Rail Station: మారనున్న బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు

లబ్ధిదారుల ఎంపిక ఇలా ఉంది..

మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వ పాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న ఆశా వర్కర్ల సహకారంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆశా వర్కర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి రేషన్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ పథకానికి అర్హులైన వారి పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే రేషన్‌కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణలో దాదాపు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. వీరిలో 64 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతం రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు. మిగిలిన 26 లక్షల రేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేదు…వీరికి ఈ పథకం వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 26 లక్షల మంది కొత్త గ్యాస్ సేకరణ తీసుకుంటే ఈ పథకం వర్తిస్తుంది.
German: గంజాయి వినియోగంపై జర్మన్ పార్లమెంట్ కీలక నిర్ణయం.. ఆ బిల్లుకు ఆమోదం!

Exit mobile version