NTV Telugu Site icon

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

ఎడ్‌సెట్ 2021 ఫ‌లితాలను విడుదల చేశారు తెలంగాణ ఉన్నత విద్యా మండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ లింబాద్రి.. ఈ సారి ఎడ్‌సెట్‌లో 98.53 శాతం ఉత్తీర్ణత సాధించిన‌ట్లు వెల్లడించారు… ఎడ్‌సెట్‌కు 34,185 మంది విద్యార్థులు హాజరుకాగా.. మొత్తంగా బీఎడ్ కోర్సులో ప్రవేశాల‌కు 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించ‌గా.. అందులో 25,983 మంది అమ్మాయిలే ఉండడం విశేషం.. ఈ ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇక, మొదటి ర్యాంక్‌ తిమ్మిశెట్టి మ‌హేంద‌ర్ (నల్గొండ), రెండో ర్యాంక్‌ ప్రత్యూష (మంచిర్యాల), మూడో ర్యాంక్ రిషికేశ్ కుమార్ శ‌ర్మ.. ఈ ఏడాది రాష్ట్రంలోని 206 కాలేజీల్లో 18వేల సీట్లు ఉన్నట్టు వెల్లడించారు.