ఆదివాసీ లను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి లో ఎలా సభ పెడుతుంది అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ప్రశ్నించింది. మా పండగ రోజు రాజకీయ సభకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ , రాష్ట్రప్రభుత్వందే భాద్యత అని తెలిపింది. ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కే రెండు సార్లు మోసం చేసింది. ఇప్పుడు మూడో సారి మా ఆదివాసీ దినోత్సవాన్ని హైజాక్ చేస్తోంది. 1976 లో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ లను మోసం చేసింది. 1981లో ఇంద్రవెల్లి లో కాల్పులు జరిపి ఆదివాసీలను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొంది. ఇప్పుడు అలాంటి పార్టీ ఎలా పోరు గడ్డ పై దండోరా సభ పెడుతుంది అని తెలిపింది.
ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు మోసం చేసింది…
