Site icon NTV Telugu

Hyderabad: గమనిక.. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions Min

Traffic Restrictions Min

హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నేడు భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌, సైబర్‌ టవర్స్‌-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఉద‌యం 9 గంటల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ స‌మయాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని సూచించారు.

జూబ్లీహిల్స్‌లోని నీరూస్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లే వారు అయ్యప్ప సొసైటీ నుంచి దుర్గం చెరువు- ఇనార్బిట్‌- ఐటీసీ కోహినూర్‌- ఐకియా- బయోడైవర్సిటీ- గచ్చిబౌలి మీదుగా సైబర్‌ టవర్స్‌ వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలని పోలీసులు తెలిపారు. మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ ప్రాంతాల నుంచి వచ్చే వారు హైటెక్‌ సిటీ- సైబర్‌ టవర్స్‌- జూబ్లీహిల్స్‌ వచ్చే వాహనాలు రోల్లింగ్‌ హిల్స్‌ ఏఐజీ హాస్పిటల్‌-ఐకియా-ఇనార్బిట్‌- దుర్గం చెరువు రోడ్డులో ప్రయాణించాలని సూచించారు. అటు ఆర్‌సీపురం, చందానగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు బీహెచ్‌ఈఎల్‌- నల్లగండ్ల- హెచ్‌సీయూ- ట్రిపుల్‌ ఐటీ-గచ్చిబౌలి రోడ్డులో కొండాపూర్‌, ఆల్విన్‌ రోడ్డు వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలన్నారు.

TRS Plenary: గులాబీ సంబురం.. సర్వం సిద్ధం..

Exit mobile version